గ్రేటర్ యుద్ధం: రేపు జరగబోయే ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం - సీపీ అంజనీ కుమార్!
అందులో భాగంగానే రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను చేయడం నిషేధించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరూ ఆయుధాలను చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. అలాగే ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం వంటివి కూడా నిషేధించారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయడం.. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్ లౌడ్ స్పీకర్లను ఉపయోగించరాదు. రాళ్లను కలిగి ఉండడం, తరలించం కూడా చేయరాదు. రోడ్లపైనా, కూడళ్లలో ప్రసంగాలు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కూడా చేయరాదని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈ ఫలితాల కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.