గ్రేటర్ యుద్ధం : గెలుపు బీజేపీదే ?

Satya
గ్రేటర్ ఎన్నికల్లో అసలైన గెలుపు మాత్రం బీజేపీదే అని చెప్పాలి. బీజేపీ ఏకంగా అర్ధ సెంచరీకి దగ్గరగా సీట్లు సంపాదించింది. ఆ పార్టీకి గత కార్పొరేషన్ లో కేవలం 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆనాడు 45 సీట్లలో పోటీ చేసిన బీజీపీ 4 మాత్రమే నాడు దక్కించుకుంది. ఇపుడు చూసే మొత్తం 149 సీట్లలో పోటీకి దిగి మూడవ వంతు తెచ్చుకుంది. అది కూడా సొంతంగా తొడగొట్టి మరీ గెలిచింది. ఇది నిజంగా బీజేపీకి ఘనమైన విజయం కింద చూడాలి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మళ్ళీ బీజేపీకి రోజులు వచ్చాయని చెప్పాలి. అప్పట్లో అంటే టీయారెస్ పుట్టకముందు, టీడీపీ ఉన్న రోజుల్లో బద్ధం బాలిరెడ్డి, ఆలె నరేంద్ర  లాంటి వారు బీజేపీకి పెద్ద లీడర్లుగా ఉండేవారు. అప్పట్లో బీజేపీకి భాగ్యనగరంలో బలం చాలానే ఉండేది. ఒకానొక టైంలో బీజేపీయే సోలోగా  చక్రం తిప్పింది కూడా.
మళ్ళీ నాటి రోజులు వస్తున్నాయా అనిపించేలా తాజా ఎన్నికల్లో సీట్లు వచ్చాయి. ఈ సీట్లు చాలు బీజేపీ హైదరాబాద్ సహా తెలంగాణా అంతటా పాతుకుపోవడానికి ఇపుడు టీయారెస్ కి అసలైన ప్రతిపక్షం ఎవరూ అంటే అది బీజేపీనే అని చెప్పాల్సివుంటుంది. బీజేపీ కొన్ని తప్పులు చేయడం వల్ల దాదాపుగా మరో పది నుంచి పదిహేను సీట్లు కోల్పోయింది అని కూడా అంటున్నారు. బీజేపీ అనవసరంగా పాత బస్తీ, సర్జికల్ స్ట్రైక్స్ అంటూ కెలుక్కుంది. దాంతో తటస్థ ఓటర్లు దూరం అయ్యారు. లేకపోతే బీజేపీకి వచ్చిన ఊపునకు మరో డజన్ సీట్లు హ్యాపీగా వచ్చి ఒళ్ళోకి వాలేవి. ఏది ఏమైనా దడ పుట్టించి మరీ బరి లోకి దిగిన బీజేపీ ఇక మీద హైదరాబాద్ కి గుండే కాయ లాంటి గ్రేటర్ లో పవర్ ఫుల్ అప్పోజిషన్ గా తొడగొట్టి మరీ బస్తీ మే సవాల్ చేయనుంది. నిజానికి ఈ ఎన్నికల్లో అసలైఅన్ విజేత ఎవరూ అంటే అది బీజేపీ అనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: