గ్రేటర్ యుద్దం : తేలిన ఫలితాలతో డైలమాలో పార్టీలు..హంక్ పక్క..??
ఈ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి కూడా రాకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.మేయర్ పీఠాన్ని అధిస్టించడానికి టిఆర్ఎస్ దగ్గరగా ఉన్నప్పటికి ఇతర పార్టీ బలం కావాల్సిందే.ప్రస్తుతం టిఆర్ఎస్ సంపాదించుకున్నవి 54, టీఆర్ఎస్ దగ్గర ఉన్న ఎక్స్అఫీషియో ఓట్లు 38 ఉన్నప్పటికీ పార్టీ బలం 92 మాత్రమే అవుతుంది. అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు కచ్చితంగా కావాల్సిందే.
ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందా..అన్నది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం సొంతంగా 42 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంను మద్దతు కోరే అవకాశం ఉంది. అయితే ఎంఐఎం ఎలాంటి డిమాండ్లు కోరుతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ బిజేపి,ఎంఐఎం కలిసిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కష్టం కాబట్టి కచ్చితంగా టిఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకోక తప్పదు.