అత్తా కోడళ్ళ మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిపోయింది..?

praveen
అత్తా కోడళ్ళ మధ్య గొడవలు అనేది ప్రతి ఇంట్లో చాలా కామన్ అన్న విషయం తెలిసిందే. అదేంటోగాని టీవీలో చూపించినట్లుగా అత్తా కోడళ్ళ మధ్య అన్యోన్యత ఎక్కడ ఉండదు... అదేదో పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తున్నట్లుగా ఏ ఇంట్లో చూసినా అత్తా కోడళ్ళ మధ్య ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే .  అత్త చేసిన పనికి కోడలికి నచ్చకపోవడం..  కోడలు తీరు అత్తలు నచ్చకపోవడం జరుగుతూ ఉంటుంది. అత్తా కోడళ్ళ మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇది ఏ ఇంట్లో అయినా సర్వసాధారణం.  కానీ కొన్ని కొన్ని సార్లు అత్తా కోడళ్ళ మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద నష్టం కలిగిస్తూ ఉంటాయి ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.



 కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది...  విజయవాడ సమీపంలోని పునాదిపాడు లో అత్తా కోడళ్ళ మధ్య జరిగిన గొడవ  ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.  బీసీ కాలనీకి చెందిన తిరుపతమ్మ పద్మావతి అత్తా కోడళ్లు.
 అయితే ఎనిమిదేళ్ల కిందట భర్త చనిపోవడంతో పద్మావతి  అత్త తిరుపతమ్మ తో కలిసి జీవిస్తుంది. పద్మావతి పిల్లలకు పెళ్లి కావడంతో వేరేచోటికి వెళ్లిపోయారు. అయితే కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నా అత్త కోడళ్లు  గత కొన్ని రోజుల నుంచి ప్రతి విషయంలో గొడవలు పడడం మొదలుపెట్టారు. ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా పద్మావతిని సూటిపోటి మాటలు అనేది అత్త.



 వీరిద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పోయింది ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తురాలైన  కోడలు పద్మావతి ఏకంగా రోకలిబండతో అత్త తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వృద్దురాలు తిరుపతమ్మ రక్తపు మడుగులో పడి పోయింది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు తిరుపతమ్మ మృతి చెందింది అంటూ నిర్ధారించారు. ఇక తిరుపతమ్మ కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మావతీని అరెస్టు చేశారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: