ధోని 2.0.. నయా ఫినిషర్.. అభిమానులు ఫిదా..?
ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ రవీంద్ర జడేజా హార్థిక్ పాండ్యా పేర్లు ఎక్కువగా చర్చలోకి వచ్చాయి. అయితేగత కొన్ని రోజుల నుంచి మిడిలార్డర్ సమస్యతో బాధ పడుతున్న టీమిండియాకు ఇప్పుడు ఆ సమస్య తీరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన హార్దిక్ పాండ్యా మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తూ మ్యాచ్ ఫినిషింగ్ ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. భారత్ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో... తానే పూర్తిగా బాధ్యత తీసుకొని అద్భుతమైన బౌండరీలు బాదుతూ జట్టుకు విజయాన్ని అందించాడు
కేవలం సిక్సర్లు బౌండరీలు బాదాడమే కాదు మరో వైపు పరుగుల మధ్య కూడా ఎంతో శరవేగంగా పరుగులు పెడుతున్నాడు హార్థిక్ పాండ్యా . ఎంత పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు. సాధారణంగా ధోని చివరి బంతి వరకు ఆడుతూ చివరిలో మ్యాచ్ ముగిస్తూ అని అనుకుంటూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇటీవలే మ్యాచ్ అనంతరం కూడా హార్దిక్ పాండ్యా ఇదే చెప్పుకొచ్చాడు.. మ్యాచ్ ను సిక్స్ తోనే ముగించాలని ముందే అనుకున్నా.. అందుకే చివరి బంతి వరకు మ్యాచ్ తీసుకెళ్లకూడదు నిర్ణయించుకున్నాను అంటూ వెల్లడించాడు. ఏదేమైనా ప్రస్తుతం హార్థిక్ పాండ్యా ధోని 2.0 అని అంటున్నారు అభిమానులు.