ఏలూరులో వైద్య సిబ్బందికి కూడా సోకిన వింత వ్యాధి..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇప్పుడు ఎవరికీ అర్ధం అంతుచిక్కని పరిస్థితులు జరుగుతున్నాయి. ఏలూరు  ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. తాజాగా, వైద్య సిబ్బంది సైతం కూడా ఈ అంతు చిక్కని  వ్యాధి సోకి బాధపడుతున్నారు. ఇక 108 కి సంబంధించిన సిబ్బంది ఒకరు, స్టాఫ్ నర్స్ ఒకరు కళ్లు తిరిగి కిందపడిపోవడం జరిగింది.అంతుచిక్కని ఈ వ్యాధితో ఇప్పటివరకు ఆస్పత్రికి చేరుకున్నవారు  451 మంది అయ్యారు. ఇంకా, ప్రైవేలు ఆస్పత్రుల్లో సైతం కొంతమంది  చేరడం జరిగింది. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 263 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు.. ఇంకా 171 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపడం జరిగింది.

పరిస్థితి కాస్త  విషమంగా ఉన్న 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించడం జరిగింది.ఇక సమస్యపై కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ ఎయిమ్స్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జంషెడ్‌ నాయర్‌ నేతృత్వంలో బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించడం జరిగింది. ఇందులో సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైరాలజిస్ట్‌ అనినాష్‌ దేవ్‌, ఎన్‌సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ సంకేత కులకర్ణి ఉన్నారు.

మంగళవారం ఉదయం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ బృందాన్ని ఆదేశించడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: