అయన టీపీసీసీ అధ్యక్షుడు అయితే మిగితావారు కాషాయం గూటికే..?

P.Nishanth Kumar
భారతదేశంలో  కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా తయారైందో అందరికి తెలిసిందే.. ఆ పార్టీ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కొన్ని సమావేశాల ద్వారా స్పష్టం గా తెలిశాయి.. పార్టీ లోని సీనియర్ నేతలకు యువనేతలు అస్సలు పడడం లేదని అర్థమవుతుంది.. కేంద్రంలోని పార్టీ నేతల మధ్య పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు తామేమీ తక్కువ తినలేదన్నట్లు వారికంటే ఎక్కువగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ఫలితంగా ప్రజల్లో చులకన అయిపోయి కీలక ఎన్నికల్లో ఓటమిపాలవుతున్నారు..

ఇటీవలే తెలంగాణ లో నిర్వహించిన దుబ్బాక ఉప ఎన్నిక ,  గ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఒక్కసారిగా కలకలం మొదలైంది..అందరిలో నిరాశ కూరుకుపోయింది..తద్వారా  వారి ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై ఉన్న పరువు తీసేసుకుంది..

ఇక తాజాగా టీపీసీసీ పదవికి జరుగుతున్న కుమ్ములాటలు చూసి కాంగ్రెస్ పార్టీ మరోసారి నవ్వుల పాలవుతుంది. పార్టీ లో ఏ ఒక్కరి కి ఐఖ్యత లేకపోవడంతో ఎవరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక అయినా వేరేవాళ్లు పార్టీ ని వదిలి వెళ్లిపోవడానికి రెడీ అవుతున్నారట..నిజానికి బీజేపీ పార్టీ ఎప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని ఆశగా చూస్తుంది. పీసీసీ చీఫ్ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే మిగతా సీనియ‌ర్ల నేత‌ల అంత‌ర్గ‌త అసంతృప్తి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే అవ‌కాశంగా బీజేపీ వారిని త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జానారెడ్డి, అంజ‌న్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌లు బీజేపీలో చేరుతున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో పీసీసీ ప్ర‌క‌ట‌న కీల‌కంగా మార‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: