చంద్రబాబు కన్నా.. బ్రిటీష్ వారే నయం...!
కటిక పేదరికంలో అల్లాడుతూ తమ బిడ్డలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివించాలని ఉన్నా స్తోమత లేక బాధ పడుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వమే ఒక చక్కటి మార్గం చూపించాలని కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించారు. జగన్ అన్న తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదనకు రూప కల్పన చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఎందుకు చంద్రబాబు అడ్డు పీఠం వేస్తున్నారు అంటూ... దూరదృష్టి లేని చంద్రన్న పేదల జీవితాలకు ఎలా దోహద పడతాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇకనైనా ఆయన ఆలోచనలు మెరుగవ్వాలి అని...చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించి దళితులకు అడ్డు పడకుండా ఉండాలని కోరుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బహుజన పరి రక్షణ సమితికి చెందిన దళిత నాయకులు. బహుజన పరి రక్షణ సమితి సంఘాల నాయకులు బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, కిషోర్, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఏదేమైనా పేద ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతామని.... ఆశయం నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు చంద్రబాబు కంటే నయమని వీరు ప్రస్తావించడం కొసమెరుపు...