గుడ్ న్యూస్.. రేషన్ బియ్యం డోర్ డెలివరీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?
ఇటీవలే ఏపీ ప్రజలందరికీ మరో శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. సాధారణంగా పేద ప్రజలకు ప్రభుత్వం ప్రతి నెల రేషన్ అందిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. రేషన్ ద్వారా బియ్యం అందించడంతో పాటు పలు రకాల నిత్యావసర లను కూడా అందిస్తూ ఉంటారు. అయితే ప్రజలు అందరూ ఇలాప్రతి నెల రేషన్ తీసుకోవడానికి పెద్ద క్యూ కట్టి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ టైంలో అయితే క్యూలలో నిలబడాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అన్ని తొలగిపోయేలా చేసేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. రేషన్ బియ్యం నిత్యవసర వస్తువులను ఫిబ్రవరి 1 నుంచి డోర్ డెలివరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి మూడవ వారంలో వాహనాలను ప్రారంభించనుంది జగన్ సర్కారు. ఇక అదే రోజున పది కేజీల బియ్యం బ్యాగ్ లను కూడా ఆవిష్కరించనున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వాహనాల లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం జగన్ సర్కార్ కసరత్తులు ప్రారంభించింది.