ఆవు పేడ, మూత్రంతో తయారుచేసినవే వాడండి.. మంత్రి సూచనలు..?
ముఖ్యంగా ఆవు పేడ మూత్రంతో తయారుచేసిన సబ్బులు షాంపూలు వాడటం కారణంగా ఎంతగానో మేలు జరుగుతుంది అని ఇప్పటికే ఎంతోమంది నిపుణులు కూడా సూచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం కొంతమంది అయితే ఆవు పేడ మూత్రం కూడా సర్వరోగ నివారిణి అని కూడా చెబుతూ ఉంటారు. ఆవు పేడ మూత్రం లో ఎన్నో సుగుణాలు ఉంటాయని.. దాదాపు అన్ని రకాల ఆయుర్వేద మందులలో కూడా ఆవు పేడ మూత్రం ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.
ఇటీవలే ఓ మంత్రి కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రజలందరూ కూడా ఆవు మూత్రం పేడతో తయారు చేసిన సబ్బులు షాంపూలు అగర్బత్తీలు మాత్రమే వాడాలని కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి సూచించారు. ప్రస్తుతం ఆవుపాలు పెరుగుతో పాటు ఆవు పేడ మూత్రంతో తయారు చేసేటటువంటి సబ్బులు షాంపూలు అగర్బత్తీలు మరియు వివిధ రకాల మందులను కూడా వాడటం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది అంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ కర్ణాటక ప్రజలను కోరారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని శాస్త్రీయంగా కూడా ఇది నిరూపించబడింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.