కేసిఆర్ నమ్మించి మోసం చేశారు.. కాంగ్రెస్ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్..?

praveen
ఇటీవలే హైదరాబాద్లో రైతుదీక్ష కార్యక్రమం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక రైతు దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలిపింది  కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ కూడా అటు అధికార టీఆర్ఎస్ పార్టీ పై బిజెపి పార్టీ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నతీరు పట్ల ప్రజలు అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాదు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది అంటూ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేతలు. అటు బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అటు బిజెపి టిఆర్ఎస్ పార్టీ లను ఉద్దేశిస్తూ సంచలన విమర్శలు గుప్పించారు.


 అయితే మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉన్న బిజెపి పార్టీ అనూహ్యంగా పుంజుకుని అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.  వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటుతోంది బిజెపి పార్టీ. దుబ్బాక లో విజయం సాధించగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించినంత పని చేసింది.  అయితే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న వి.హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేశారు.



 గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేస్తానని కేసీఆర్ సోనియా గాంధీకి మాట  ఇచ్చారని..  అయితే సోనియా గాంధీ కి ఇచ్చిన మాట తప్పడమే  కాదు ఇప్పుడూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు చేశారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. కేసిఆర్ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేస్తామని సోనియాగాంధీని నమ్మించి మోసం చేశారు అంటూ విమర్శించారు. అంతే కాదు దేశాన్ని లూటీ చేసే వారిని తమ పార్టీలో చేర్చుకుంటూ పాప పరిహారం అవుతుంది అంటూ బిజెపి చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ విమర్శించారు వి హనుమంత రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: