వ్యాక్సిన్ కోసమే కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కోసం కూడా ప్రత్యేక ఆసుపత్రులు..?

praveen
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అంతా సిద్ధం అయ్యింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ప్రారంభంకానుంది అనే విషయం తెలిసిందే.  ఇక ఇప్పటికే వ్యాక్సిన్ లను   అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియకు ముందు పలు ప్రాంతాలలో వ్యాక్సిన్ డ్రై రన్  నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఇక జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రజలందరికీ సమర్థవంతంగా వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే దిశానిర్దేశం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.  ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వాక్సిన్ అందించబడే ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు గానే వ్యాక్సిన్  తీసుకున్న వ్యక్తులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తక్షణమే వైద్యం అందించేందుకు కూడా ప్రత్యేకంగా ఆసుపత్రులను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం.



 వ్యాక్సిన్  తీసుకున్న తర్వాత ఒకవేళ వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే  తక్షణమే వైద్యం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 235 ఆసుపత్రులను వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 57 ప్రభుత్వ.. 178 ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్  తీసుకుని సైడ్ ఎఫెక్ట్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు 1300 బెడ్ లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాక్సిన్ సెంటర్ కి కోవిషీల్డ్ టీకా  రాగా.. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ అందించేందుకు అన్నీ సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: