ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,134కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా భారీ నుండి 231 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల 75 వేలకి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి .. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు చూసుకుంటే పండగపూట క్రమేపి తగ్గిపోతున్నాయి .. గడిచిన గంటల్లో దేశంలో కొత్తగా 15 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి .. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది.ఇందులో కోటి ఒక లక్ష 29 వేల మంది కోలుకోగా , ప్రస్తుతం దేశం లో రెండు లక్షల 14 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి .. అలాగే మరణాల సంఖ్య చూస్తే ఈరోజు కరోనాతో 202 మంది మరణించారు .. దీంతో కరోనా మరణాల సంఖ్య ఒక లక్ష 51 వేలకి చేరింది .. సంక్రాంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గడం నిజంగా సంతోషించదగ్గ విషయం .. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది ..