జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

Satya
ప్రతీ దాడికి  ఎదురు వ్యూహం ఉంటుంది. ఏది ఏలా ఎదుర్కోవాలో పదునైన పధకాలు కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని వ్యూహాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. ప్రభుత్వంలో ఉన్న వారికి విమర్శలు తప్పవు. అదే సమయంలో తెలివిగా పావులు కదిపితే సరిదిద్దుకోవడం కూడా వారికి చాలా సులువు.
ఇపుడు జగన్ అదే పని చేస్తున్నారు. ఏపీలో హిందూ కార్డు ని ముందు పెట్టి జగన్ని దెబ్బ కొట్టాలని విపక్షాలు వేస్తున్న ప్లాన్ ఆచరణలో బెడిసికొడుతోంది. దానికి కారణం జగన్ రివర్స్ స్ట్రాటజీని ఉపయోగించడమే. ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా జగన్ హిందూ కార్డును  అదే కార్డుతోనే తిప్పి కొడుతున్నారు. జగన్ చంద్రబాబు హయంలో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించే పనులకు ఈ మధ్యనే శ్రీకారం చుడితే విపక్షానికి సౌండ్ లేకుండా పోయింది.
ఇపుడు కనుమ రోజున గో మాతకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇక జగన్ సైతం అదే రోజున  గుంటూరులోని నర్సారావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. గో పూజ చేశారు. దాంతో హిందువులకూ అతి పవిత్రమైన గోవును పూజించడం ద్వారా జగన్ వాడిన హిందూ కార్డ్ అదిరిపోయింది.
దాంతో తెలుగు తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకరి తరువాత ఒకరు జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దేవాలయాల మీద దాడులు జరుగుతూంటే పట్టని ప్రభుత్వం  ఇపుడు గోపూజలు  అంటూ రాజకీయం చేస్తోందని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మండిపడుతున్నారు. ఏపీలో దేవాలయాల మీద దాడులు చేసిన వారి మీద చర్యలు లేవంటూ విమర్శించారు. ఇల ఇదే కోవలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య వంటి వారు వైసీపీ మీద గట్టిగానే కౌంటర్లేస్తున్నారు. అంటే మొత్తానికి జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ శిబిరంలో రీ సౌండ్ ఇలా వినిపిస్తోందని  అంటున్నారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: