ముద్రగడ పార్టీ మారుతున్నారోచ్... ఈ సారి ఆ పార్టీలోకే...!
ఇక రాజకీయంగా మళ్లీ ముద్రగడ యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆయన ఈ సారి బీజేపీ వైపు వెళ్లే అవకాశాలున్నాయన్నదే తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న టాక్ ? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు-ముద్రగడ భేటి జరగబోతోందంటు ఒకటే ప్రచారం జరిగిపోతోంది. వాస్తవానికి ముద్రగడ ఒకప్పుడు రాజకీయంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన నేత. ఆయన మాజీ మంత్రి.. మాజీ ఎంపీగా కూడా ఉన్నారు. ఆ తర్వాత పార్టీలు మారి రాజకీయంగా వెనకపడిపోయారు.
రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా తప్పుకుని చాలా రోజులే అయ్యింది. ఓ అవుట్ డేటెడ్ పొలిటిషీయన్గా ముద్ర వేయించుకున్న ఆయన వల్ల ఏ పార్టీకి ఒరిగేదేమి లేదని అన్ని పార్టీలు డిసైడ్ అయిపోయాయి. ముద్రగడకు ఏ పార్టీలోనూ పొసగట్లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏ విషయంలో అయినా తన మాటే చెల్లుబాటు కావాలని పంతానికి పోవటం లాంటి అనేక లక్షణాల వల్ల చివరకు ఏ పార్టీకి కాకుండా పోయారు. అయితే బీజేపీ మాత్రం ఏపీలో పలువురు అవుట్ డేటెడ్ పొలిటిషీయన్లనే పార్టీలో చేర్చుకుంటోంది.
ఇప్పుడు వీళ్లకు ముద్రగడ కూడా ఓ ఆప్షన్గా కనిపిస్తున్నారు. మరి ముద్రగడ బీజేపీలో ఇమడ గలుగుతారా ? ఆయన కాషాయ రాజకీయం కొనసాగేనా ? అన్నది చూడాలి.