యూట్యూబ్ లో అది చూసి.. చివరికి ఎంత పని చేశారు..?

praveen
ఈ మధ్యకాలంలో దొంగల బెడద రోజురోజుకు ఎక్కువైపోతున్నది  అన్న విషయం తెలిసిందే.  ఇంటికి తాళం కనిపించిందంటే చాలు ఇక ఇల్లును  గుల్ల  చేస్తున్నారు దొంగలు.  అదే సమయంలో అటు పోలీసులకు ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా ఉండేందుకు ఎంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అయితే ఈ మధ్య కాలంలో జనాలపై సినిమాలు, సీరియల్, యూట్యూబ్ వీడియోలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది సినిమాల ద్వారా ప్రభావితమై నేరస్థులుగా మారిపోతూ హత్యలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇక మరి కొంతమంది యూట్యూబ్ లో వీడియోలు చూసి దొంగతనాలు ఎలా చేయాలి అని ట్రైనింగ్ తీసుకుని.. అంతేకాకుండా పోలీసులకు దొరకకుండా ఎలా ఉండాలి అనేదానిపై  ఎంతో పకడ్బందీగా యూట్యూబ్ వీడియోలు చూసి ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా తెర  మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ లో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు కొంతమంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు.  కానీ ప్లాన్ కాస్త బోల్తా కొట్టి చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.



 ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బీదర్ కు చెందిన వాజిత్ అనే 19 ఏళ్ల యువకుడు ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు  వచ్చాడు.  ఇక పాత నేరస్తుడు అయిన అబ్దుల్ సమీర్  తో ఒక ముఠా  ఏర్పాటు చేసుకొని.. నేరాలు చేయడం మొదలు పెట్టాడు.  ఇక జనవరి 3న జగదీష్ మార్కెట్ లోని మహాలక్ష్మి ఆలయంలో  చోరీ జరగగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందుకున్నారు. ఇక ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు..  ముమ్మర దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే సాజిద్ సహ మిగతా ముఠా సభ్యులు చోరీలు చేస్తున్నారని విచారణలో తేలడం తో..  ముగ్గురు సభ్యులను పట్టుకున్న పోలీసులు.. మరో ముగ్గురు  నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: