కేసీఆర్ దరిద్రం అంటూ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు
పీఆర్సీ ఇవ్వకుండా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను ముఖ్యమంత్రి విభజిస్తున్నాడు అని మండిపడ్డారు. పీఆర్సీ అడిగితే కేసీఆర్ భోజనాలు పెడ్తున్నాడు అని ఆయన విమర్శించారు. తన తెలివి తేటలను కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించాలి అని సూచించారు. 50వేల మంది రోహింగ్యాలను తిప్పిపంపాలని కోరుతున్నా కేసీఆర్ పెడచెవిన పెడ్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ సహా దేశమంతా బీజేపీ వైపు చూస్తోంది అని ఆయన అన్నారు. త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370రద్దు చేసిన మొనగాడు నరేంద్ర మోదీ అని ఆయన కొనియాడారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ దరిద్రపు, దగుల్బాజీ ముఖ్యమంత్రి అని అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా.. సీఎం కేసీఆర్ జైల్ జీవతం గడపక తప్పదు అని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోదీని కలిశాడు అని మండిపడ్డారు. అనేక మంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ దగా చేశాడు అని విమర్శలు చేసారు. డబుల్ బెడ్ రూం, రైతు రుణమాఫీ, నిరుద్యోగులను సైతం కేసీఆర్ మోసం చేశాడు అని అన్నారు. బీజేపీ ఎక్కడుందో.. గజ్వేల్, సిద్ధపేట, సిరిసిల్ల ప్రజలను అడిగితే చెప్తారు అని అన్నారు