ఎస్సై పై మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసిన కర్నూలు బీజేపీ నేతలు...
గతేడాది ఏప్రిల్లో లాక్డౌన్ సమయంలో మసీదు వివాదమంటూ పిలిచిన ఎస్ఐ శ్రీనివాసులు తనపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీని వీడి వైఎస్సార్సీపీలో చేరకపోతే గ్రామం వదిలి వెళ్లాలని.. తలపై రివాల్వర్ పెట్టి బెదిరించారన్నారు. మండల పరిషత్ ఎన్నికల్లో పోటీకి బీజేపీ తరఫున నామినేషన్ వేసినందుకు గతేడాది మే 19న తన ఇంటిపైకి 300 మందితో కలిసి వచ్చిన వైఎస్సార్సీపీ నేత సిద్ధార్థరెడ్డి దాడి చేశారని.. తనను, కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపర్చారన్నారు. ఈనెల 12న రైతులు, మార్కెట్ ఏజెంట్లతో తన ఇంటి దగ్గర సమావేశం నిర్వహించగా.. నాగరాజు అనే వ్యక్తి పెద్దగా కేకలు వేస్తుండడంతో దూరంగా వెళ్లమని కోరామని... అతను ఎస్ఐ శ్రీనివాసులును పిలుచుకువచ్చారన్నారు. ఎస్ఐ తనను, జలీల్బాషాను ఠాణాకు తీసుకువెళ్లి అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు కొట్టారని ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా వైఎస్సార్సీపీలో చేరాలని పదేపదే హెచ్చరించారన్నారు. తాము గాయపడినప్పటి ఫొటోలను ఎన్హెచ్ఆర్సీ, మైనారిటీ కమిషన్కు అందజేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థరెడ్డితోపాటు ఇతరులపై కేసులు నమోదు చేయాలని కోరారు.