మాజీ సీఎం ఆరోగ్యం అత్యంత విషమం..
లాలూ ఆరోగ్యం విషమించిందని తెలియడంతో.. బీహార్ ప్రతిపక్ష నేత లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ భార్య రబ్రీదేవి ప్రత్యేక విమానంలో పాట్నానుంచి రాంచీ వెళ్లారు. లాలూ ప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఎప్పుడైనా విషమించవచ్చని వైద్యులు తెలిపారు. అయితే ఆయనను మరో ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. డయాబెటిస్ కారణంగా అవయవాలు దెబ్బతిన్న వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎలాంటి మందులు లేవని వైద్యులు తెలిపారు.
డిసెంబర్ 2017న prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ కు పశు దాణా కేసులో ఏడేళ్ల శిక్ష పడింది. దీంతో ఖైదీగానే ఆయన.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రెండేళ్ల క్రితం ఆగస్టు 30, 2018న prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా రిమ్స్ లో చేరారు. పశుదాణా కుంభకోణంతోపాటు.. ఇతర కేసుల్లో కూడా ఆయనకు జైలు శిక్ష పడింది. గత అక్టోబర్లో లాలూకు చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. దమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. 1991 నుంచి 1996 మధ్య కాలంలో లాలూ సీఎంగా ఉన్న సమయంలో దమ్కా ట్రెజరీ నుంచి రూ. 3.5 కోట్లు అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష పడింది.
కొవిడ్ నెగెటివ్..
మరోవైపు లాలూకి నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో కోవిడ్ నెగెటివ్గా వచ్చింది.. నమూనాలను సేకరించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్కు పంపించారు.