13 ఏళ్ళకే మందు, సిగరెట్.. సర్వేలో బయటపడిన ఆసక్తికర నిజాలు..?
కేవలం 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలి అనే నిబంధన ప్రతి మద్యం దుకాణం ముందు, పెట్టినప్పటికీ... మద్యపానం ధూమపానం ద్వారా ఆరోగ్యానికి హానికరం అని ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ నేటి రోజుల్లో యువత మాత్రం చెడు వ్యసనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో మరో ఆసక్తికర విషయం వెల్లడయింది. దేశంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువత యుక్త వయసులో ఎలాంటి చెడు పోకడలు పోతూ ఉన్నారు అన్నది ఈ సర్వే చెబుతోంది.
దేశంలో యుక్తవయసు మొదలయ్యే క్రమంలోనే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు ఇటీవలే ఐసీఎంఆర్ సర్వే నివేదిక చెబుతోంది. పట్టణాల్లో 15.1 ఏళ్ళ వయస్సులో మద్యపానం ధూమపానానికి అలవాటు అవుతూ ఉంటే.. గ్రామాల్లో మాత్రం 13.9 ఏళ్ల వయసులోనే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలలో యువత యొక్క శారీరక శ్రమ తక్కువగా ఉంది అని ఈ సర్వే చెబుతోంది. ఇలా చిన్న వయసులోనే ఎంతో మంది బాలబాలికలు చెడు వ్యసనాల బారిన పడుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు అని చెబుతుంది ఐసీఎమ్ఆర్ సర్వే.