కాపు వేదన: జగనోరికి గోదారి కాపుల రివేంజ్ మామూలుగా ఉండదా ?
పేరుకే నలుగురు కాపు మంత్రులు కేబినెట్లో ఉన్నా వారిలో ఏ ఒక్కరు బలమైన వాయిస్ వినిపించే వారు లేరు. పైగా తమ వర్గ ప్రయోజనాల గురించి మాట్లాడేంత క్యాపబులిటీ కూడా వీరికి లేదు. ఇక చంద్రబాబు చివరి కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కాపులకే ఏకంగా 5 శాతం కేటాయించింది. అయితే జగన్ సీఎం అయిన వెంటనే ఈ 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడంతో కాపులు మంచి అవకాశం కోల్పోయారు. కనీసం ఈ 5 శాతం రిజర్వేషన్లు ఉండి ఉంటే కాపుల్లో పేదలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మంచి అవకాశం ఉండేది.
దీంతో కాపులతో పాటు కాపు యువత జగన్ సర్కార్ పై గుర్రుగా ఉంది. ఇక గోదావరి జిల్లాలతో పాటు అటు వైజాగ్లోనూ కాపు ఎమ్మెల్యేలు ఉన్నా వీరు జిల్లాల ఇన్చార్జ్ లు, పరిశీలకు ల ఆధిపత్యంతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారట. ఇక కాపు ప్రజా ప్రతినిధులు కూడా తమ వర్గం వారు వేస్తోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాపుల పనులు కూడా కావడం లేదు. ఈ పరిణామాలతో అట్టుడుకుతోన్న కాపు వర్గం ఓటర్లు స్థానిక ఎన్నికల్లో వైసీపీపై తిరుగులేని రివేంజ్ తీర్చుకుంటారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.