రాజకీయ నేతలకు గట్టి షాక్ ఇచ్చిన కర్నూలు జిల్లా వాసులు....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొంతమంది జనాలు ఉంటారు పెద్ద పెద్ద రాజకీయ నేతలకే షాక్ ఇస్తారు. సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు జనాల ఓట్ల కోసం ఏమేమో హామీలు ఇచ్చి జనాలను నమ్మించి వారి ఓట్లు సాధిస్తారు. పాపం అమాయకపు జనాలు వారి మాటలు నమ్మి తమకేదో చేస్తారని నమ్మి ఆ రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు. వారిని గెలిపిస్తారు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటారు.అలాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉంటారు.కాని ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది. వాళ్ళు నమ్మించి మోసం చేసిన వారి మాటలను ప్రజలు ఎప్పుడు మరిచిపోరు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. ఇక అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. తమను నమ్మించి మోసం చేసిన రాజకీయ నాయకులకు సరైన గుణ పాఠం నేర్పించారు.

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కర్నూల్లోని కొడువూరు పరిధిలోని పూడూరి గ్రామంలో ప్రజలు ఒక నినాదం చెయ్యటం జరిగింది. అక్కడ 25 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉందట.ఆ రోడ్డుని బాగు చేయించే నాథుడే లేడంట. అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం దేనికని గ్రామస్థులు రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చారట. ఆ రోడ్డు వల్ల ఇప్పటికి  7మంది గర్భిణీ స్త్రీలు దారిలోనే పురిటి నొప్పులకి ప్రసవం చేసి మరణించడం జరిగిందట. అంత దారుణం అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ రోడ్డు ఎలాంటిదో. ఆ ఊరిలో దాదాపు 2000 మంది జనాభా వున్నారు ఇంకా 913 మంది ఓటర్లు కూడా వున్నారు.ఇక తాము ఎవ్వరికి ఓట్లు వెయ్యమని మాకు మా గ్రామానికి ఎన్నికలే వద్దని నినాదాలు చేస్తున్నారట. ఊరంతా దండోరా కూడా వేయించారట.ఈ విధంగా ఆ జనాలు రాజకీయ నాయకులకు గట్టి షాక్ ఇచ్చారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: