జగన్ కు పీఠాధిపతులు వార్నింగ్.. ఇది ఆంధ్రజ్యోతి ఆర్కే పులిహోరేనా..?
ఇంకేముంది.. షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకుందని రాసేశాడు.. కానీ ఆ తర్వాత షర్మిల ఈ వార్తను ఖండించారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు మరో షాకింగ్ అంశం పట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అదేంటంటే.. జగన్ కు వ్యతిరేకంగా అనేక మంది పీఠాధిపతులు కీలక సమావేశం నిర్వహించాట. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందంటున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో పీఠాధిపతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారట.
ఈ పీఠాధిపతుల సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ పెద్దలు కూడా హాజరయ్యారట. తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా ఉండేందుకు రహస్య ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించారట. ఏపీలో ఆలయాలపై దాడులు, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా వీరు సమావేశయ్యారంటున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ సమావేశానికి దేశంలోని ముఖ్య పీఠాధిపతులు హాజరయ్యారట.
అసలే.. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో పాటు మతమార్పిడులను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆగ్రహంతో ఉన్న సంఘ్ పరివార్.. ఈ భేటీ ద్వారా జగన్కు హెచ్చరిక పంపిందట. అయితే ఈ భేటీ సమాచారం తెలిసి పీఠాధిపతులతో మాట్లాడేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేత విఫలయత్నం చేశారని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే బహుశా జగనే కావచ్చు. ముఖ్య నేత సూచనతో ఓ మంత్రి రంగంలోకి దిగారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని రాసింది ఆంధ్రజ్యోతి. మరి ఇందులో నిజమెంతో ఆర్కేకే తెలియాలి.