వామ్మో.. ఇండియాలో ఇంతమందికి కరోనా వచ్చిందా.. ఐసీఎంఆర్ సర్వేలో అసలు నిజాలు.?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా  వైరస్ ప్రపంచ దేశాలలో ఎంత అల్లకల్లోలం సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రజలందరినీ ఎంతగానో బెంబేలెత్తించింది ఈ వైరస్. అయితే భారత్లో కూడా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభించింది అన్న విషయం తెలిసిందే.  మొదట్లో భారతదేశంలో అతి తక్కువ కేసులు నమోదు అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం భారత దేశంలో కరోనా వైరస్ విజృంభించిన తీరుపై ప్రజలను  తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య మాత్రం భారీగానే నమోదు అయింది అన్న విషయం తెలిసిందే.



 ఇక కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ కరోనా వైరస్ విజృంభణ మాత్రం ఎక్కడా కట్టడి కాలేదు దీంతో ఇక ఇదే రీతిలో కొనసాగితే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని అటు ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యవహరించడంతో చివరికి కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే . ఇక ప్రస్తుతం దేశంలో అతి తక్కువ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.  అంతేకాకుండా భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ప్రజలందరిలో కరోనా వైరస్ అంటే భయం పోవడమే కాదు అవగాహన పెరిగి పోవడంతో ఇక తక్కువ కేసులు నమోదవుతున్నాయి అనే చెప్పాలి.



 అయితే దేశంలో ఇప్పటివరకు ఎన్ని కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి అనే దానిపై ఇటీవల ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. 135 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చు అని ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వైరస్ వచ్చి పోయిన విషయం కూడా తెలియదు అంటూ ఐసీఎంఆర్ అధికారి ఒకరు తెలిపారు.  రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్లనే కరోనా లక్షణాలు బయట పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఏకంగా 15 మందిలో ఐదుగురికి యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: