కాపు వేద‌న‌: అక్క‌డ జ‌గ‌న్ vs బాబు vs ప‌వ‌న్‌.. గెలుపు ఎవ‌రిదో ?

VUYYURU SUBHASH
ఏపీలో కాపులు రాజ‌కీయ అధికారాన్ని బ‌లంగా శాసించే జిల్లా తూర్పు గోదావ‌రి. ఈ సారి ఈ జిల్లాలో జ‌రుగుతోన్న స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ప‌ల్లె ప్రాంత‌పు ఓట‌రు.. ఇంకా చెప్పాలంటే ప‌ల్లె ప్రాంతాల్లో ఉన్న కాపు వ‌ర్గం ఓట‌ర్లు త‌మ తీర్పు ఎటు మొగ్గు చూపుతారు ? అన్న‌దే ఆస‌క్తిగా మారింది. పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీ సింబ‌ల్‌పై జ‌ర‌గ‌క‌పోయినా ప‌రోక్షంగా ఈ ఎన్నిక‌లు మాత్రం పార్టీల పేరు మీదే న‌డుస్తుంటాయి. గ‌తంలో జ‌రిగిన స్థానిక స‌ర్పంచ్‌, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలో నాడు టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

నాడు చంద్ర‌బాబు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు అనేకానేక హామీలు ఇచ్చారు. ఇవ‌న్నీ క‌లిసొచ్చాయి. ఇక చంద్ర‌బాబు మీకోసం పాద‌యాత్ర కూడా నాడు టీడీపీకి క‌లిసొచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. గ‌త ఎన్నిక‌ల్లో కాపులు కాపు కార్పొరేష‌న్ పెట్టి కాపుల‌కు నిధులు ఇచ్చినా, జిల్లాకే చెందిన నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌కు హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చినా టీడీపీని చిత్తుగా ఓడించారు. తోట త్రిమూర్తులు లాంటి బ‌ల‌మైన కాపు నేత‌లే ఇక్క‌డ ఓడిపోయారు.

క‌ట్ చేస్తే ఎన్నిక‌ల త‌ర్వాత చాలా మంది కాపు నాయ‌కులు, కేడ‌ర్ టీడీపీని వ‌దిలేసి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు జిల్లాలో స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. మొత్తం 62 మండ‌లాలు ఉన్న తూర్పు గోదావ‌రిలో 1069 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కాపులు జ‌నసేన‌, వైసీపీకే ప‌ట్టంక‌ట్టారు. దీంతో టీడీపీ చిత్త‌య్యింది. రాజోలులో రాపాక జ‌నసేన నుంచి గెల‌వ‌డానికి కార‌ణం కూడా కాపుల ఓట్లే.

అయితే ఈ సారి స్థానిక ఎన్నిక‌ల్లో జిల్లాలో కాపు ఓట‌రు ఎవ‌రికి ఓట్లేస్తార‌న్న‌ది ? ఆస‌క్తిక‌ర‌మే ? అటు చంద్ర‌బాబును గ‌త ఎన్నిక‌ల్లో ఓడించారు. జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న వీరిలో ఉంది. ఇక ప‌వ‌న్‌ను ఓట్లేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని వారు భావిస్తున్నారు. ఈ సారి వీరి తీర్పును బ‌ట్టే జిల్లాలో మెజార్టీ పంచాయ‌తీల తీర్పు డిసైడ్ కానుంది.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: