ఐడియా అదిరిపోయింది.. వరి పొట్టుతో లక్షలు సంపాదిస్తున్నాడు..
బిబు సాహూ అనే వ్యక్తి ఒక టీచర్.
అయితే 2007 సంవత్సరంలో ఉద్యోగం మానేసి అగ్రికల్చరల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను మెల్లగా రైస్ మిల్ వ్యాపారంలోకి కూడా వచ్చాడు. అయితే ఇలా రైస్ మిల్ వ్యాపారంలో ప్రతి ఏడాది కూడా మూడు టన్నుల పొట్టు వచ్చేది. ఇక దాన్ని వృధాగా ఊరి బయట కాల్చేసేవాడు. వాతావరణ కాలుష్యం జరుగుతు ఉండేది. దీంతో చుట్టుపక్కల ప్రజలు అందరూ రైస్ మిల్ పై ఫిర్యాదు ఇచ్చేవారు. అతని మనసులో ఒక ఆలోచన తట్టింది దీన్ని వృధాగా కాల్చేయకుండా దీనితో ఏదైనా చేయగలనా అని ఆలోచించాడు.
ఈ క్రమంలోనే వరిపొట్టు ను స్టీల్ పరిశ్రమలో ధర్మల్ ఇన్సులేటర్ గా వాడవచ్చు అని ఐడియా కు వచ్చి దీన్ని ఎలా అమలు చేయాలో అనేదానిపై కొంత మంది నిపుణులను కలిసి వివరాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేసి విజయం సాధించాడు. చిన్నచిన్న గుళికలుగా తయారు చేసి విదేశాల్లో కంపెనీలకు కలిసి ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. 2019 తొలిసారి సౌదీ అరేబియా పంపించాడు. ఇక ఈ ఏడాదిలోనే వంద టన్నుల గుళికల ద్వారా ఏకంగా 20 లక్షల వరకు సంపాదించాడు. దేనికి పనికిరాకుండా ఉన్న వరి పొట్టును బంగారంగా మార్చుకున్నాడు సదరు వ్యక్తి.