రెడ్డి సామాజిక వ‌ర్గంలో ష‌ర్మిల క‌ద‌లిక‌.. పార్టీల‌కు ఎస‌రేనా ?

VUYYURU SUBHASH
తెలంగాణ రాజ‌కీయాల్లో మెరుస్తాన‌ని ప్ర‌క‌టించ‌క‌నే ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌.. ఆ రాష్ట్ర రాజకీల‌య‌ను కీల‌క మ‌లుపు తిప్ప‌గ‌లుగుతారా ?  ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ష‌ర్మిల ఆ వ‌ర్గాన్ని త‌న‌వై‌పు తిప్పుకొంటారా? .. ఇదే జ‌రిగితే.. ఇత‌ర పార్టీల ప‌రిస్ధితి ఏంటి ? ఇత‌ర పార్టీల్లో ఉన్న రెడ్డి వ‌ర్గం ష‌ర్మిల‌పై న‌మ్మ‌కం ఉంచుతారా ? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిగా మారిన చ‌ర్చ‌. రెడ్డి సామాజిక వ‌ర్గానికి తెలంగాణ‌లో కొద‌వ‌లేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను నడిపిస్తున్న‌దీ.. ప‌రోక్షంగా శాసిస్తున్న‌దీ కూడా వారే. ఇక‌, బీజేపీలోనూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వంటివారే దూకుడుగా ఉన్నారు. ఇక‌, ఎటొచ్చీ.. రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పుకొనే కేసీఆర్‌.. అధికార పార్టీల్లోనే వైరుధ్యం క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి చూస్తే.. ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా ప‌డుతున్న ఇబ్బందులు ఎక్కువే... దాదాపు తెలంగాణ‌‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా ఇలాంటి అస్తిత్వంలోనే కొట్టుమిట్టాడుతోంది. త‌మ‌కు ప్రాధ‌న్యం లేకుండా పోయింద‌ని అధికార పార్టీలో రెడ్డి వ‌ర్గం ఆప‌శోపాలు ప‌డుతోంది. ఇక‌, కాంగ్రెస్‌లో రెడ్డి నేత‌లు.. ప‌ద‌వుల విష‌యంలో నువ్వా నేనా అనే రేంజ్‌లో కొట్టుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రెడ్డి వ‌ర్గానికి ఆశించిన విధంగా డ‌యాస్ ల‌భించ‌డం లేద‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలో వీరికి ఒక వేదిక అత్యవ‌స‌ర‌మ‌నే భావ‌న కూడా ఉంది.

ఇదిలావుంటే.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్గంగా ఉన్న తెలంగాణ రెడ్డి సామాజిక వ‌ర్గం.. ఇప్పుడు ష‌ర్మిల వైపు చూస్తే.. ఇత‌ర పార్టీల్లో దాదాపు క‌ద‌లిక ఖాయ‌మ‌ని అంటున్నారు. వైఎస్ హ‌యాంలో తెలంగాణ‌లోని రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. వారికి ప‌ద‌వుల విష‌యంలోనూ వైఎస్ అనేక రూపాల్లో మేళ్లు చేశారు. అయితే.. వీరిలో స‌గంమందికిపైగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. జానారెడ్డి.. త‌దిత‌రులు.. ఇప్ప‌టికీ గుర్తింపు కోసం వెంప‌ర్లాడుతున్నారు. ఇక‌, స‌బిత ఇంద్రారెడ్డి వంటివారు.. మాత్రం కేసీఆర్ గూటికి చేరినా.. స్వేచ్ఛ‌లేద‌నే భావ‌న‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల క‌నుక వీరిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. ఉమ్మ‌డి న‌ల్గొండ‌, క‌రీంన‌గ‌ర్‌, రంగారెడ్డి.. హైద‌రాబాద్ స‌హా సుమారు.. ఉమ్మ‌డి 10 జిల్లాల్లో 6 జిల్లాల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా ష‌ర్మిల తీసుకునే లైన్.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే విధానం వంటివి రెడ్డి వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు ప్ర‌ధానంగా దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: