హైదరాబాద్ మెడలోమణిహారం దేశంలోనే పొడవైన బైపాస్ - తెలంగాణ "రీజనల్ రింగ్ రోడ్"
*ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.17000కోట్లు. ఇందులో రూ. 4వేల కోట్లు భూసేకరణకు ఖర్చుకానుంది. ఐతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.1,905 కోట్లు భరించాల్సి ఉంటుంది. భూసేకరణ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వానిదే.
*సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించ బోయే మొదటి దశకు 2017 లోనే జాతీయ రహదారి 161 ఏఏ గా కేంద్రం గుర్తించింది. ఇక చౌటుప్పల్ - షాద్నగర్ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నెంబర్ కేటాయించాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నాగపూర్–హైదరాబాద్–బెంగళూరు కారిడార్, పుణె–హైదరాబాద్–విజయవాడ కారిడార్లో జాతీయ రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యత పెరుగుతుంది. ముంబై, పుణె, నాగపూర్, బెంగళూరు, ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్గాల ద్వారా దారి మళ్లిస్తారు.
అప్పుడు హైదరాబాద్ చుట్టూ వాహనాల రాకపోకలు తగ్గి, ట్రాఫిక్ సమస్యతో పాటు వాయు కాలుష్యం కూడా తగ్గు తుంది. రాష్ట్రం భూసేకరణ త్వరిత గతిన చేపడితే కేంద్రం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తుందని గడ్కరీ చెప్పినట్లు కిషన్రెడ్డి వివరించారు. ఆర్ఆర్ఆర్ ఆ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడేళ్ల లోగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.