పుర పోరు : పులివెందుల, రాయచోటి పురపాలక సంఘాల్లో ఆసక్తికరంగా భారీ నామినేషన్లు..
పులివెందుల పురపాలక సంఘంలో మొత్తం 33 వార్డులకు 21, రాయచోటిలో మొత్తం 34 వార్డులకు 21 చోట్ల ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవ్వడంపై ఎస్ఈసీ సందేహం వ్యక్తం చేసింది. పులివెందుల పురపాలక సంఘానికి సంబంధించి అభ్యర్థులు నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు సజావుగానే జరిగినట్లు జిల్లా అధికారులు ఎస్ఈసీకి నివేదించినట్లు సమాచారం. రాయచోటి పురపాలక సంఘంలో మాత్రం నామినేషన్ల సమయంలో పలు హింసాత్మక సంఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను ఎస్ఈసీకి పంపించారు.
అయితే ఈ రెండు నియోజక వర్గాల్లో ఇప్పటివరకు నమోదు అయినవి, ఉపసంహరించుకున్న వి మొత్తం వివరాలను సంభందిత అధికారులు సేకరించారు. 2020 మార్చి 11 నుంచి 15వ తేదీ మధ్య జరిగిన నామినేషన్ల ప్రక్రియపై పోలీసుల వద్ద నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు జత చేశారు. జిల్లాలో మిగిలిన ఆరు పురపాలక సంఘాల్లోనూ బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ అడిగిన నివేదికను జిల్లా అధికారులు మంగళవారం పంపినట్లు తెలిసింది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..