పుర పోరు: తిరుపతి పురపాలక ఎన్నికల పై వైసీపీ సంచలన ప్రకటన..
ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రభుత్వ ఖరారు చేస్తుంది. ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాలో ప్రకటించగా ఇప్పుడు తిరుపతి లో ఆయా స్థానాలకు పోటీ చేసి మరణించిన వారి స్థానాలను భర్తీ చేసే ఆలోచనలో పడ్డారు. తిరుపతి లోక్సభ సభ్యులు దివంగత బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి వరించనుంది. ఈ మేరకు అభ్యర్థిత్వాన్ని వైకాపా గురువారం ప్రకటించింది. సెప్టెంబరు 16న అనారోగ్యంతో తిరుపతి ఎంపీ కన్నుమూశారు. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో నవంబరు 19న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అభ్యర్థిత్వం విషయమై సమావేశం జరిగింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసనసభ్యులు పాల్గొన్నారు.
సాధారణంగా పదవిలో ఉంటూ మరణిస్తే వారసులకు అవకాశం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిత్వం విషయమై చర్చ నడిచింది.కల్యాణ్ చక్రవర్తి రాజకీయాలకు కొత్త కావడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎంపీ స్థానానికి ఇతరులను ఎంపిక చేయాలని తలచారు. ఇంకా తిరుపతి ఉప ఎన్నిక జరగనప్పటికీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీల ఎన్నిక ముందుగా వచ్చింది. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు స్థానాల్లో ఓ స్థానం నుంచి కల్యాణ్ చక్రవర్తికి అవకాశం కల్పించారు. వెంకటగిరిలో నివాసం ఉంటున్న అభ్యర్థి ఇంజినీరింగ్ పట్టభద్రుడు. తండ్రి దుర్గాప్రసాద్ ఆశయాలను నెరవేర్చడానికి తనవంతు కృషి చేస్తానని అభ్యర్థి మీడియా ద్వారా వెల్లడించారు..