విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పిన పౌర విమానాయ శాఖ.. !
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజ్, 15 కిలోల వరకు చెక్ ఇన్ లగేజ్లను తీసుకెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకునే వారికి అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై చెక్ ఇన్ బ్యాగ్లు లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో డిస్కౌంట్ ఇస్తారన్నమాట.
అయితే ఈ డిస్కౌంట్లు పొందాలంటే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్ యొక్క బరువును ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ‘ఎయిర్ లైన్ బ్యాగేజీ పాలసీ ప్రకారం.. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తప్పకుండా ఈ టికెట్ ధరలకు సంబంధించిన స్కీం గురించి వివరాలు వారికి తెలియ జేయాలి.అలాగే వారికీ చెప్పిన తరువాత ఆ స్కీమ్స్ వివరాలను తప్పనిసరిగా టికెట్పై ప్రింట్ చేయాలి’ అని డీజీసీఏ ఒక నివేదికలో పేర్కొంది.ఒక విధంగా చెప్పాలంటే ఇది విమాన ప్రయాణికులకు శుభవార్త అనే చెప్పాలి. ! మరి ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోండి.. !!