ఆ ఒక్క విషయంలో షర్మిల కల నెరవేరడం లేదా..ఎంతైనా జగన్ జగనే.?
ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతోంది అన్నది అర్థం అయిపోయింది. పార్టీ పెట్టేందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం షర్మిల కల నెరవేరడం లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే .
అయితే జగన్ ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సమయంలో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాదు ఎంతో మంది పదవులను సైతం వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ షర్మిల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. షర్మిల పార్టీ పెడతాను అని చెప్పినప్పటికీ ఇక ఇతర పార్టీల నుంచి షర్మిల పార్టీ లో చేరడానికి ఎవరు సిద్ధం కావడం లేదు అని అర్థమవుతుంది. చుట్టపుచూపుగా షర్మిల తో సంప్రదింపులు జరుపుతున్నారు తప్ప.. ఇక షర్మిల పార్టీలో చేరి క్రియాశీలక వ్యవహరించేందుకు ఇతర పార్టీల నేతలు మొగ్గు చూపకపోవడంతో ఇక షర్మిల కల నెరవేరడం లేదు అన్నది అర్ధమవుతుంది.