కన్నీళ్లు తెప్పిస్తున్న రైతు సూసైడ్ లేఖ... ఢిల్లీలో ఉద్రిక్తత..
అయితే ఇప్పటి వరకు వివిధ దశల్లో జరిగిన రైతు పోరాటాలు, పదుల సంఖ్యలో చర్చలు, శాంతియుత పోరాటాలు జరిగిన నేటికి రైతులు పోరాడుతున్న కొలిక్కి రాకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన రైతుల సమస్యలపై ప్రభుత్వం వెనక్కి వచ్చి న్యాయం చేయాలని. సాగు చట్టాల్ని రద్దు చేసే వరకూ వెనకకు తగ్గేదిలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. లక్ష్యాన్ని సాధించడంతో ఇప్పటికిప్పుడు తాము విజయం సాధించకపోయినప్పటికీ రైతుల్లో ఐక్యత తీసుకురావడానికి ఈ ఉద్యమం దోహదపడిందని మరో నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.
వ్యవసాయ కుటుంబాల్లోని యువకుల్లో ఈ ఉద్యమం గొప్ప మార్పు తీసుకువచ్చిందని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నేత కవిత కురుగంటి పేర్కొన్నారు. ఉద్యమం కారణంగా పంజాబ్లో యువత దురలవాట్లకు దూరమవుతున్నారని, మద్యం తాగడం తగ్గిందని పేర్కొన్నారు. అలాగే, మహిళా రైతులకు గుర్తింపు పెరిగిందని కవిత వివరించారు. ఇదిలా ఉండగా ఆదివారం తాజాగా ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హరియాణాకు చెందిన 49 ఏళ్ల రాజ్బీర్ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుపుతూ రాజ్బీర్ లేఖ కూడా రాశారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోవడమే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమని అందులో రాజ్బీర్ పేర్కొన్నారు.