విజయవాడ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేశినేని

Gullapally Rajesh
విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో టీడీపీ కి అద్భుతమైన స్పందన కనిపిస్తుంది అని  ఆమె చెప్పుకొచ్చారు. పేదవారు, మధ్యతరగతి ప్రజల పై జగన్మోహన్ రెడ్డి పన్నుల రూపంలో వీర బాదుడు బాదుతున్నాడు అని కేశినేని శ్వేత  ఆరోపించారు. ఇసుక ధరలు పెంచుతూ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. మీకు అన్యాయం చేస్తే మేము ఉరుకొము,నేను మాటా ఇస్తున్న అంటూ ఆమె చెప్పుకొచ్చారు.  కార్పొరేషన్ మా చేతికి రాగానే అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ  ప్రారంభింభిస్తాము అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు ఆమె. ఫ్రీ బస్ లు ఏర్పాటు చేసి ,మహిళలు సురక్షితంగా ఇంటికి వెళ్ళే ల చూస్తాం అని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మఒడి, పథకాలు కోసం గత ప్రభుత్వం పెట్టిన పథకాలు మొత్తం తీసేసారు అని ఆమె మండిపడ్డారు. ఒక చేత్తో పెట్టి మరో చేతితో లాగేస్తున్నాడు జగన్ అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ విస్తీర్ణం ఎంత?...ఊరు బయట 1 సెంట్ భూమి ఏమి చేసుకుంటారు ప్రజలు అని నిలదీశారు.
టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడలో నగరంలో భూమి ఇస్తాము అని ఆమె పేర్కొన్నారు. కార్పొరేషన్ మా చేతికి రాగానే ప్రజలకు విజయవాడ నగర పరిది లో ఇళ్ళ నిర్మించి ఇస్తాము అని హామీ ఇచ్చారు. మీ స్వేచ మైన ఓటును మాకు వేసి గెలిపించండి అని ఆమె కోరారు. మహిళా దినోత్సవం నాడే రాజధాని ఉద్యమం కోసం పాటుపడుతున్న మహిళలలను అమ్మవారి ఆలయంకి వెళ్ళకుండా అడ్డుకోవడం అరాచకం అని మండిపడ్డారు. మహిళ పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్న అని అన్నారు. కాగా నేటితో విజయవాడలో ప్రచారం ముగిసింది. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: