ఆంధ్రప్ర‌దేశ్‌- తెలంగాణ మ‌ధ్య మ‌రిన్ని రైళ్లు... ఏప్రిల్ 1 నుంచి అవి కూడా..

Spyder
లాక్‌డౌన్‌తో దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా సుదీర్ఘకాలం పాటు రైలు సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. దాదాపు మూడు నెల‌లు ప‌ట్టాలెక్క‌లేదు. ఆ త‌ర్వాత క్ర‌మంగా ఒక్కో రైలును పున‌రుద్ధ‌రించుకుంటూ వ‌స్తోంది రైల్వేశాఖ‌. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ప‌లు ఎక్స్‌ప్రెస్‌ల‌ను న‌డుపుతున్న రైల్వే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం మ‌రికొన్నింటిని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.  కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి రైళ్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నారు. ఒకటి రెండు రైళ్లను మినహాయిస్తే దాదాపు అన్ని రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. ఏప్రిల్‌ 1 నుంచి మరికొన్ని రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. లాక్‌డౌన్‌ తరువాత నిలిచిపోయిన రైళ్లను తిరిగి నడపడానికి రైల్వే శాఖ అనుమతించింది.


గుంటూరు- కాచిగూడ రైలు (07251), కాచిగూడ-రేపల్లే రైలు (07625), సికింద్రాబాద్‌-కర్నూల్‌ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ కర్నూల్‌-సికింద్రాబాద్‌ హద్రినీవా ఎక్స్‌ప్రె్‌సలు కూడా ఏప్రిల్‌ 1నుంచి ప్రారంభంకానున్న రైళ్లు ఇవే... విజయవాడ–సికింద్రాబాద్‌–విజయవాడ(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02799/02800, విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02739/02740, గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు : 07239/07240, గూడూరు –విజయవాడ–గూడూరు(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02734/02644, నర్సాపూర్‌–ధర్మవరం–నర్సాపూర్‌(మెయిల్ ఎక్స్‌ప్రెస్): 07247/ 07248, ఈ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్దరించానున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడవనుంది. కాగా, ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యేక ట్రైన్స్‌గా నడుపుతుండగా.. ప్యాసింజర్ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్దరించలేదు. రెగ్యులర్ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు.



కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అన్‌లాక్‌ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో మొత్తం 300 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండగా, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పునరుద్ధరించాలని ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా నిర్ణయించారు. వీటిని ఏప్రిల్‌ 1వ తేదీనుంచి మార్గాలవారీగా ప్రారంభించనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు శుక్ర‌వారం అధికారికంగా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: