ఏపీకి ప్రత్యేక హోదా పై జగన్ మౌనవ్రతం..!!
టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చంద్రబాబు పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రి రావెల కిషోర్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే తమ ముఖ్యమంత్రి పై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. మీడియా గొంతు నొక్కుతున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు.
మంత్రి రావెల కిషోర్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కి భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందని ఈ కారణంగానే ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరు సరిగా లేదన్నారు.