రాజమండ్రి జూనియర్ కాలేజీ హాస్టల్లో కరోనా కలకలం.. ఏకంగా 175 మందికి సోకిన కరోనా...
ఆ తరువాత మంత్రి మీడియాతో మాట్లాడటం జరిగింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్డౌన్ ఎదుర్కోవలసి ఉంటుందని వేణు చెప్పారు.జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ మార్చి మూడోవారం నుంచి అడ్డుఅదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ అంతకంతకూ కోరలు చాస్తోంది.ఏరోజుకారోజు నమోదవుతోన్న పాజిటివ్ల సంఖ్య రెట్టింపవుతోంది.
దీంతో సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్ల పరంపర కొనసాగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. మాస్క్ ఉంటేనే ఆయా పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. లేకుంటే ఖచ్చితంగా చాలా అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...