తెలంగాణలో కరోనా కాటుకు మాజీ మంత్రి బలి
కేసీఆర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందూలాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ సర్పంచ్ నుంచి చందూలాల్ రాజకీయ ప్రస్థానం మెుదలుపెట్టారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ములుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా 2 సార్లు చందూలాల్ గెలుపొందారన్న కేసీఆర్.. మంత్రిగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ కృషి చేశారన్నారు. చందూలాల్ మృతి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తీరని లోటని సీఎం కేసీఆర్ అంజలి ఘటించారు.
చందూలాల్ మృతి పట్ల పలువురు మంత్రులు కూడా సంతాపం తెలిపారు. చందూలాల్ మృతి పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ సంతాపం తెలిపారు. చందూలాల్ కుటుంబసభ్యులకు మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చందూలాల్ మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కూడా సంతాపం తెలిపారు. చందూలాల్ మృతి తెరాసకు, గిరిజన సమాజానికి తీరని లోటని తెలిపారు. చందూలాల్ మృతి పట్ల మంత్రి ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. చందూలాల్ కుటుంబసభ్యులకు ఈటల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జగ్గన్నపేటకు చెందిన చందూలాల్ తొలుత 1981లో సర్పంచ్గా గెలిచారు. 1982లో టీడీపీలో చేరిన ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1994 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో టీడీపీని వీడి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది.