సాగర్ ఉప ఎన్నిక: అలాంటివారు ఇప్పుడే ఓటేయడానికి వీల్లేదు...?
అక్కడ తెరాసదే గెలుపు అని అంతా అనుకున్నారు. కానీ ఉత్కంఠగా జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపు బావుటా ఎగురవేశారు. కాబట్టి ఎవరినీ అంత తక్కువ అంచనా వేయకూడదని తెలుస్తోంది. కాగా పోలింగు శాతం మందకొడిగా సాగుతోంది. పోలింగు జరిగే కొద్దీ శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇదంతా ఇలా ఉండగా, ఇప్పుడు కరోనా ఉధృతి పెరుగుతున్న సమయంలో....నాగార్జునసాగర్ నియిజకవర్గ పరిధిలో కూడా కరోనా సోకిన ఓటర్లు ఉన్నారు. వీరిని మాత్రం అందరితో పాటుగా ఓటు వేయడానికి ఎలక్షన్ అధికారులు అనుమతించలేదు.
ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల తరువాత వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. వీరి ఓట్లు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సమయానికి పోలయిన ఓటింగు శాతం మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మరియు ఓటు వేసి వచ్చిన వారు కూడా వీరిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం..ఏమి జరగనుందో..నాగార్జునసాగర్ అభివృద్ధికి ప్రజలు ఎవరిని ఎనుకోనున్నారో..?