అయిన వాళ్ళు వదిలేస్తే.. పంచాయతీ కార్యదర్శే దేవుడయ్యాడు.?
సొంత వాళ్ళు రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు పరాయివాళ్ళ లాగా దూరంగా ఉంటే చివరికి పరాయివాళ్లే ముందుకు వచ్చి మానవత్వంతో సహాయం చేస్తున్న ఘటనలు కూడా అందర్నీ కలచివేస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో. ఇటీవలే ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అయితే అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు కుటుంబీకులు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి సమయంలో అటు పంచాయతీ కార్యదర్శి దేవుడిలా ముందుకొచ్చాడు.
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస పంచాయితీలో చోటుచేసుకుంది. ఇక ఆ పంచాయతీ కార్యదర్శి ధైర్యంగా ముందుకు వచ్చిన తీరు అందరిచేత ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే కరోనా వైరస్ సోకగా.. ఇక సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు భయపడిపోయారు ఎవరూ ముందుకు రాలేదు ఇలాంటి సమయంలో పంచాయతీ కార్యదర్శి ముందుకు వచ్చి పి పిఈ కిట్ ధరించి ఇక తన ద్విచక్రవాహనంపై కరోనా రోగిని ఆస్పత్రికి తరలించారు.