కరోనా రోగులు కాదు.. ఎవరంటే..?
ఇక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. ఇకపోతే కౌంటింగ్ కేంద్రం అనగానే ఎక్కువమంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంది. అయితే ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోని ఓ కౌంటింగ్ కేంద్రంలో పరిస్థితికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోలో ఎంతో మంది పిపిఈ కిట్లు ధరించి ఉన్నారు.
అయితే ఇందులో పీపిఈ కిట్లు ధరించి ఉన్న వాళ్ళను చూస్తే మాత్రం కరోనా పేషెంట్స్ అనుకుంటారు అందరు. కానీ ఇక్కడ ఉన్నది కరోనా పేషెంట్ కాదు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది. అందరూ ఇక విధినిర్వహణలో తమ ప్రాణాలను కూడా కాపాడుకోవడానికి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉత్తర దినాజ్పూర్ జిల్లా లోని రాయిగాంజ్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద కౌంటింగ్ జరుగుతుంది అక్కడ సిబ్బంది అందరూ కూడా పిపిఈ కిట్ ధరించి కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొన్నారు. ఒక్కసారిగా కరోనా రోగులు ఒక దగ్గర ఉన్నట్లుగా ఇక సిబ్బంది అందరూ పిపిఈ కిట్ ధరించి ఉన్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో మారిపోయింది. ఇటీవలే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా అటు తృణమూల్ కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతుంది. అదే సమయంలో ఈ సారి అటు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. సాయంత్రానికల్లా ఎవరు విజయం సాధించారు అనే దానిపై పూర్తి స్థాయికి క్లారిటీ రానుంది..