తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఈటల సంక్షోభం హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఊహించని విధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలను పార్టీ ఒక్కసారిగా పక్కన పెట్టింది. ఇప్పుడు ఈటల వ్యవహారం తిరిగి పార్టీకి తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్ రాజీ రాజకీయం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అదేమిటి అంటే ఈటెల రాజేందర్ రాజీ పడటానికి సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ హైకమాండ్ కు సమాచారం పంపినట్టు టీఆర్ఎస్ లో ఒక వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అదే సమాచారాన్ని కొన్ని పత్రికల చేత ప్రచురింప చేశారు కూడా.