బ్లాక్ ఫంగస్: రూ.314 ఇంజెక్షన్ రూ.50 వేలకు ... ముఠా అరెస్ట్ ?
ఇప్పుడు వీరి గురి బ్లాక్ ఫంగస్ ను నివారించడంలో కీలకంగా మారిన ఔషధాన్ని సైతం అక్రమమగా అమ్ముకునేందుకు రెడీ అయిపోయారు. అయితే ఈ సారి డాక్టర్స్ కూడా ఈ దుర్మార్గపు వ్యవహారంలో భాగమవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న హైద్రాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 మంది బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లను పట్టుకున్నారు. వీరి నుండి 5 ఇంజక్షన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఓఎస్డీ రాధాకిషన్ రావు మీడియాకు తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి పెరుగుతుండడంతో, దీనికి డిమాండ్ పెరిగిందని అందుకే వీరు ఈ విధంగా చేస్తున్నట్లు తెలిసింది.
కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒక ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ రవితేజతో చేయి కలిపి ఆంపోటెరిసీన్ బీ ఇంజక్షన్ లను అక్రమంగా సంపాదించారు. ఈ ముఠాలో మొత్తం 5 మంది ఉన్నారు. వీరిలో 2 డాక్టర్లు కావడం విశేషం. ప్రస్తుతం వీరికి సహాయం చేసిన రవితేజ అనే డాక్టర్ పరారీలో ఉన్నాడు. ఈ ఆంపోటెరిసీన్ బీ ఇంజక్షన్ ధర 314 రూపాయలు కాగా వీరు రోగుల పరిస్థితిని వాడుకుని 50 వేల రూపాయలకు అమ్మడానికి ప్రయత్నించారు. కాబట్టి ప్రజలు అంతా అవగాహన పెంచుకోండి. ఒక్క హాస్పిటల్ లో దొరికే మందులనే వాడండి. ఇలా అక్రమార్కుల చేతిలో మోసపోకండి అని పోలీసులు వారికి సలహాలు ఇస్తున్నారు.