గుడ్ న్యూస్! ఆంధ్రాలో భారీగా తగ్గిన కేసులు...

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కేసులు భారీగా తగ్గాయి.ఇక రాష్ట్రంలో కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో చూసుకున్నట్లయితే కేసులు 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదయ్యేయి..కాని ఇప్పుడు ఈ కేసుల సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకోవడం ఊరట కలిగించే విషయం అని చెప్పాలి. తాజాగా చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మొత్తం 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది మృత్యు వాత పడి చనిపోయారు. ఇక అందులో కొత్తగా సుమారు 5వేల కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో తెలిపడం జరిగింది.గడిచిన 24 గంటల్లో 64,800 శాంపిల్స్‌ పరీక్షిస్తే , అందులో 4,872 మంది కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అవ్వడం జరిగింది. ఇక ఇప్పటి దాకా రాష్ట్రంలో 1.98కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగింది. ఇక తాజాగా 13,702మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని సురక్షితంగా బయటపడ్డారు.


ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కరోనా కేసులు నమోదవ్వగా ,గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 86మంది చనిపోవడం జరిగింది.ఇక ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 13మంది చనిపోగా, గుంటూరు జిల్లాలో 10,  అనంతపురం జిల్లాలో 9, శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 7, పశ్చిమగోదావరి జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో నలుగురు చనిపోయారు. ఇక ఇప్పటి దాకా కరోనా మహమ్మారితో 11,552మంది మృతి చెందడం జరిగింది.


ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా కేసులు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 535. చిత్తూరు జిల్లాలో 961. తూర్పు గోదావరిలో 810. గుంటూరు జిల్లాలో 374. వైఎస్ఆర్ కడప జిల్లాలో 404. కృష్ణా జిల్లాలో 175. కర్నూలు జిల్లాలో 212. ప్రకాశం జిల్లాలో 447. శ్రీకాకుళం జిల్లాలో 166. విశాఖపట్ణణం జిల్లాలో 189. విజయనగరం జిల్లాలో 207.పశ్చిమ గోదావరి జిల్లాలో 160. ఇక మొత్తం జిల్లాల కేసులు 4872 వున్నాయి . ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 17,60,316 పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో 16,34,254 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: