ఛీ.. ఛీ వృద్ధురాలిని కూడా వదల్లేదు.. పింఛన్ ఇప్పిస్తామని చెప్పి?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వృద్ధురాలు విషయంలో కూడా కనికరం చూపించలేదు మోసగాళ్లు. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఏకంగా మాయ మాటలతో నమ్మించి ఆ వృద్ధురాలు దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం కాజేశారు. వరుసకు బంధువులే కదా అని నమ్మి చివరికి వృద్ధాప్యంలో మోసగాళ్ల బారినపడి ఆస్తి మొత్తం కోల్పోయి దిక్కులేకుండా మారిపోయింది వృద్ధురాలు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వృద్దురాలి ఆస్తి పై కన్నేసిన బంధువులు ఇక పెన్షన్ ఇప్పిస్తాము అంటు నమ్మబలికారు మోసం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నిమ్మ పల్లి కి చెందిన నరసవ్వ దంపతులకు సంతానం లేరు. అయితే భర్త చనిపోవడంతో నరసవ్వ ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అయితే ఆమె పేరు మీద కొంత ఆస్తి ఉంది. ఈ క్రమంలోనే నరసవ్వ ఆస్తి పై కన్నేసిన ఆమె బంధువైన శంకర్ అతని కుమారుడు నరేష్ పెన్షన్ ఇప్పిస్తామంటూ వృద్ధురాలికి నమ్మబలికారు. ఈ క్రమంలోనే చదువురాని నరసవ్వతో కాగితాల పై సంతకాలు తీసుకున్నారు. ఇక అధికారులకు లంచం ఇచ్చిన నరసవ్వ పేరుమీద ఉన్న ఇళ్ళుతో పాటు రెండు ఎకరాల భూమిని కూడా తన పేరుమీద రాయించుకున్నారు. చివరికి ఆ వృద్ధురాలిపై కాస్తయినా దయ చూపకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు.