ఇదెక్కడి అరచాకం.. ఆఖరికి హిజ్రాలను కూడా వదలరా?
వడ్డీ లపై చక్రవడ్డీ లు వసూలు చేస్తూ అదేమని ప్రశ్నించినందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 వేల రూపాయలు అప్పు తీసుకుంటే వారానికి ఐదు వేల రూపాయలు వడ్డీ చెల్లించాలని కరోనా కారణంగా తమకు ఆదాయం లేదని చెప్పినా వాళ్ళు వినడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక అప్పు తీర్చలేదని ఇళ్ల మీదకు వచ్చి గొడవ చేస్తూ దుర్భాషలాడుతూ ఉన్నారని ఫిర్యాదులో హిజ్రాలు పేర్కొన్నారు.
వాళ్ళ బాధలు భరించలేక వేరే ప్రాంతంలో అద్దెకి వెళదామని ప్రయత్నిస్తే అక్కడ కూడా అద్దెకు ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా అరవై ఐదు వేల రూపాయలు అప్పు తీసుకుంటే రెండు లక్షల రూపాయలు చెల్లించాలని బెదిరిస్తున్నారని వాళ్ళు చెప్పినట్లు డబ్బు చెల్లించకపోతే కొడతామని కూడా బెదిరిస్తున్నారని హిజ్రాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నో రోజులు వేచి చూసిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పు కలగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని హిజ్రాలు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని హిజ్రాలు పోలీసు అధికారులను కోరుతున్నారు.