నన్ను చూస్తూనే భయం పట్టుకుంది.. సిగ్గు,శరం లేదు!
కాకతీయుల నాటి గొలుసు కుట్టు చెరువులు సమైక్య రాష్ట్రంలో ధ్వంసం చేశారని అందుకే రాష్ట్రం ఏర్పాటుకు నాలుగు నెలల ముందుగానే స్వప్నించి మిషన్ కాకతీయ పేరు పెట్టామని ఆయన వెల్లడించారు. దేశానికి ధాన్యాగారమైన పంజాబ్ ను అధిగమించామని తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు ఉండేవి...నేడు 25 లక్షలకు పెంచామని అన్నారు. చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్న ఆయన తాగు నీటికి, విద్యుత్ కు కొరత లేదని అన్నారు.
కొన్ని రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు,శరం లేదని అన్నారు. అధికారులకు నన్ను చూస్తూనే భయం పట్టుకుందన్న ఆయన ప్రతి ఐదు వేల మందిని క్లష్టర్ గా రైతు వేదిక నిర్మించామని అన్నారు. సిద్దిపేట చైతన్యానికి ప్రతీక అని అన్నారు. రైతు కేంద్రంగా ప్రభుత్వం పని చేస్తుందన్న ఆయన రైతు చల్లగా ఉంటే దేశం బాగుంటుందని, రైతుకు సహాయం చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందే రైతు బంధని అన్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా చేయడమే రైతు రాజ్యం అని అన్నారు. ఇక ఎన్టీఆర్ తీసుకు వచ్చిన రెండు రూపాయలు కిలో బియ్యం పధకం చాలా బాగా నచ్చిందని ఆయన అన్నారు.