చైనా దాచిన నిజం బయటపడింది.. మొదటి కరోనా కేసు ఎప్పుడో తెలుసా?
అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి వెళ్ళిన ఊహన్ ల్యాబ్ లో పరిశోధనలు చెయ్యనివ్వలేదు. కానీ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ఒక బృందంగా ఏర్పడి కరోనా వైరస్ నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇటీవలే మరో నిజం బయటపడింది. చైనాలో మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది నవంబర్ 17వ తేదీన అనే విషయం బయటపడింది. ఆ తర్వాత జపాన్లో తర్వాత థాయిలాండ్, స్పెయిన్ దేశాలకు పాకింది అనే విషయాన్ని ఇటీవలే నిపుణుల బృందం గుర్తించింది.
తర్వాత కొరియా, అమెరికా ఇలా అన్ని దేశాలు కూడా వైరస్ బారిన పడ్డాయి అనే విషయాన్ని గుర్తించారు. నవంబర్ 17న మొట్టమొదటి కేసు వెలుగులోకి వచ్చినప్పటికీ చైనా ఈ విషయాన్ని దాచి ప్రపంచ దేశాలలో విపత్కర పరిస్థితులు తీసుకురావాలని భావించింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు నిపుణులు . ఇలా ప్రపంచ దేశాల వినాశనానికి చైనా చేసిన కుట్ర కరోనా వైరస్ అని అంటున్నారు . కరోనా కు సంబంధించి ఒక్కొక్క నిజం బయటపడుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు చైనా ను దోషిగా నిలబెడుతున్నాయి బయటపడుతున్న నిజాలు . ఇక మరి కొన్ని రోజుల్లో ఎలాంటి నిజాలు బయట పడతాయి అన్నది చూడాలి మరి.