ఆశ్చర్యం : ఇప్పటి వరకు వర్షం కురవని గ్రామం..!
‘అల్-హుతైబ్’ గ్రామం భూ ఉపరితలానికి 3వేల 200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామంలోని వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. రాత్రుల వణికించే చలి ఉండగా.. పగలు సూర్యుడు రాగానే ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇది ఈ ప్రాంత వాసులకు అలవాటే. పర్యాటకులు కూడా ఈ వాతావరణాకి బాగానే అలవాటు పడిపోతారు. ఈ గ్రామంలో పాత కాలపు నిర్మాణలతో పాటు.. కొత్త నిర్మాణాలు కూడా దర్శనమిస్తాయి.
ఇదిలా ఉంటే భారత్ లో నైరుతి రుతుపవనాలు ఈ నెలలో సాధారణంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సగటున 94 నుంచి 106 శాతం వర్షాలు పడతాయని వెల్లడించింది. జులై మాసంలో మొదటి వారంలో ఊహించని విధంగా వర్షాలు కురవకపోవచ్చని అభిప్రాయపడింది. ఇక రెండో వారంలో వర్షాలు జోరుగా పడతాయని స్పష్టం చేసింది. అంతేకాదు ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఆ ఉష్ణోగ్రతలు ఇప్పట్లో తగ్గవని చెప్పింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఉత్తర రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వేడిగాలులు కొనసాగుతాయని పేర్కొంది. ఇటీవల అక్కడ టెంపరేచర్ 40 డిగ్రీలు దాటింది.