2007 తర్వాత మళ్లీ ఇప్పుడే...
దీంతో 2007 తర్వాత తొలిసారిగా జులై నెలలోనే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు నెలలో డ్యామ్ గేట్లు పైకి ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తారు. కానీ ఈ ఏడాది జులై నెలలోనే రికార్డు స్థాయి వరద రావడంతో... వారం రోజులు ముందుగానే డ్యామ్ జలకళను సంతరించుకుంది. మొత్తం 12 గేట్లలో ఈ సాయంత్రం 3 గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డ్యామ్ లో నీరు పూర్తిగా రావడంతో... గేట్ల ద్వారా ఇప్పటికే నీరు లీక్ అవుతోంంది. అటు పై నున్న సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ఇటు దిగువనున్న నాగార్జున సాగర్ పరిహాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు కాలువల్లో విద్యుత్ ఉత్తత్పి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అటు దిగువనున్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ల నుంచి ఇప్పటికే వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.